పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

Date:

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ధరల లోటు భర్తీ పథకం కింద ప్రతి కిలో పొగాకుకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.188 కోట్లు వెచ్చించనున్నాయి.

అలాగే రాష్ట్రంలో 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు కిలో ధర రూ.240, మీడియం గ్రేడ్ రూ.190, లో గ్రేడ్ రూ.110 కంటే తగ్గకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...