రాజమహేంద్రవరంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

Date:

రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, రహదారులు, మహిళా సంక్షేమం తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, సామాజిక భద్రత వంటి రంగాల్లో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

గోదావరి పుష్కరాలు–2027కు ఏర్పాట్లు

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రూ.2,643 కోట్లతో 1,612 పనులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.428 కోట్ల విలువైన 362 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు

తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హేవ్‌లాక్ బండ్ అభివృద్ధితో పాటు పుష్కర్ ఘాట్, కడియం నర్సరీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఇతర పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి, పరోక్షంగా మరో 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు.

స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువతకు ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...