
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. అతడు ఇప్పటి వరకూ 278 మ్యాచులు ఆడాడు. మొత్తంగా ఐపీఎల్లో 250 పైచిలుకు మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు ఐదుగురు ఉన్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తిక్ ఉన్నారు. ఇందులో దినేశ్ కార్తిక్ మినహా మిగతా ప్లేయర్లంతా ఐపీఎల్ 2026లో ఆడుతున్నారు.
ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు అన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అయితే టోర్నీ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ లీగ్లో ఆడుతున్న ప్లేయర్లు నలుగురు మాత్రమే ఉన్నారు. వారే విరాట్ కోహ్లీ , మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ , మనీశ్ పాండే. ఇందులో విరాట్ కోహ్లీ.. ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నారు. మిగతా ముగ్గురు ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంఛైజీలకు ఆడారు.
అయితే ఐపీఎల్ చరిత్రలో 250కి పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లు సైతం కొందరు ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరిలో దినేశ్ కార్తిక్ ఇప్పటికే ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. మిగతా నలుగురు ఐపీఎల్ 2026లో ఆడుతున్నారు
మహేంద్ర సింగ్ ధోనీ:
ఐపీఎల్లో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 278 మ్యాచ్లు ఆడాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. చాలా ఏళ్ల పాటు కెప్టెన్గా ఉన్నాడు. ధోనీ రెండు సీజన్లలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున ఆడాడు.

