LPG Booking Rules: గ్యాస్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌ మరో కొత్త రూల్‌.. సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపు..!

Date:

LPG Booking Rules: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ప్రభావం ఎస్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై పడుతోంది. దీంతో దేశంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు మళ్లీ బుకింగ్‌ నిబంధనలు మార్చింది. ఇప్పటికే బుకింగ్‌ గడువును పెంచగా, ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు కీలక మార్పులు ప్రకటించాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్న కుటుంబాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరగవచ్చని భావించి, ముందస్తు జాగ్రత్తగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఎవరికి ఎంత గ్యాప్? : అయితే కొత్త నియమాల ప్రకారం.. రెండు సిలిండర్లు ఉన్నవారు ఒకటి బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 35 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే ఉజ్వల యోజన లబ్దిదారులకు ఈ గ్యాప్‌ను 45 రోజులకు పెంచారు. అలాగే ఒకే ఒక సిలిండర్ ఉన్నవారికి మాత్రం పాత విధానమే కొనసాగుతుంది. వారు 25 రోజుల తర్వాత మరోసారి బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్‌కు కొత్త నిబంధనలు: ఏడాదికి కేటాయించిన 12 సిలిండర్ల కోటా పూర్తయితే అదనంగా బుక్ చేయాలంటే యాప్‌లో కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో సభ్యుల సంఖ్య, ప్రత్యేక కార్యక్రమాలు (శుభకార్యాలు), అతిథుల రాక వంటి వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

డెలివరీ సమయంలో OTP నిర్ధారణ తప్పనిసరి అవసరం. e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. లేదంటే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ పూర్తయ్యిందా ? లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతకు ప్రధాన కారణం పుకార్లు, ముందస్తు నిల్వలే అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందకుండా, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయకుండా ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.

రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న కొరతకు ప్రధాన కారణం పుకార్లు, ముందస్తు నిల్వలే అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందకుండా, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయకుండా ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...