సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

Date:

కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం వేసవి కాలం రావడంతో మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండ్లలో రారాజు అయిన మామిడి పండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మార్కెట్లో బంగారు వర్ణంతో.. చూస్తేనే తినాలనే విధంగా.. నిగనిగలాడే మామిడి పండ్లు.. బండ్లు, దుకాణాల్లో సందడి చేస్తున్నాయి. రకరకాల మామిడి పండ్లు అన్నీ మార్కెట్‌కు రావడంతో మ్యాంగో లవర్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల ప్రియుల గుండె గుభేల్ మనే వార్త వచ్చింది. కొందరు కాసుల కక్కుర్తి ఉన్న వ్యాపారులు.. మామిడి పండ్లను రసాయనాలతో మగ్గించి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా.. ప్రజలను అప్రమత్తం చేశారు. కల్తీ మామిడి పండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పాలని వెల్లడించారు.

వేసవి రాకతో పండ్లలో రారాజైన మామిడి పండ్లు మార్కెట్‌లో సందడి చేస్తోందని.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజ‌లు విస్మరించకూడదని సజ్జనార్ అలర్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ.. పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...