
స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఖుదీరామ్ బోస్ దేశానికి చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.
కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఖుదీరామ్ బోస్.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి నేటి యువతకు కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా.. ఖుదీరామ్ బోస్ త్యాగం స్వాతంత్ర్య పోరాటానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆయన జీవితం చాటిచెబుతోందని తెలిపారు.
దేశ యువతలో ధైర్యం, దేశభక్తి, మాతృభూమిపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘‘భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్’’ అంటూ తన ఎక్స్ పోస్టులో నివాళులర్పించారు

