శ్రావ‌ణమాసం మూడో శుక్ర‌వారం రోజున పార్టీని ప్ర‌క‌టిస్తా : విజయసాయిరెడ్డి

Date:

విజయవాడ: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై సోమవారం మరింత స్పష్టతనిచ్చిన ఆయన.. శ్రావణమాసం మూడో శుక్రవారం విజయవాడ వేదికగా కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

పార్టీ పేరు, జెండా, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇతర అంశాలను ఆ రోజు ప్రకటిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ప్రజా సమస్యలపై పోరాడేందుకు, వారి తరఫున గళం వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు.

సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను నేరుగా చట్టసభల దృష్టికి తీసుకెళ్లేలా బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...

సుజ్లాన్ S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

https://www.youtube.com/watch?v=1zGJfDlgPvg D-News: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో ముందడుగు పడింది. సుజ్లాన్...

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకీ మొగ్గలు రావాలంటే.. ఈ ఒక్క స్పూన్ వేయండి! నర్సరీలో పాటించే చిట్కా ఇదే.

ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు....

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...