రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

Date:

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను జమ చేయనుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందేలా శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతతో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. దీని ద్వారా అనర్హులను తొలగించి, ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణలోని  అందించింది. సంక్రాంతి పండుగ లోపే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ‘ రైతు భరోసా ‘ నిధులను జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఈసారి గతానికి భిన్నంగా.. కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి. ఈ వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘సింథటిక్ ఎపర్చర్ రాడార్’ (SAR) శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ శాటిలైట్ సర్వే సత్ఫలితాలను ఇవ్వడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీని ఆధారంగానే అనర్హులను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు ఈ నివేదికల ఆధారంగా నిజమైన రైతులను గుర్తిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...