గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పేరు మార్పు బిల్లును మంత్రి స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ కార్యలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తున్నామని.. స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి స్వామి. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేరును గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలుగా మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర గ్రామ, వార్డు స్వర్ణశాఖ మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదం పొందిన తర్వాత మంత్రి కీలక ప్రకటన చేశారు. గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లో ఉద్యోగుల విధులు, బాధ్యతలపై గందరగోళాన్ని తొలగించామన్నారు మంత్రిస్వామి. ప్రభుత్వం జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. అంతేకాదు గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు (ప్రమోషన్లు) కల్పిస్తామని తెలిపారు.

పనిచేసే ఉద్యోగుల్లో అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. గత 19 నెలల్లో గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేశామన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలను జనాభాకు తగిన విధంగా వర్గీకరించామన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...