టీమిండియా ఈజ్ బ్యాక్.. చెపాక్‌లో చితక్కొట్టుడు కొట్టిన బ్యాటర్లు..!

Date:

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు నమోదు చేశారు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు సైతం మెరుగైన ప్రదర్శన చేశారు.

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మోస్తరు ప్రదర్శన చేసిన టీమిండియా బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అభిషేక్ శర్మ సహా ఇతర బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ సైతం కుదురుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 22 బంతుల్లో 48 రన్స్ జోడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...