
సౌదీ అరేబియాలో క్షిపణి దాడికి గురై భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్తతో ఆందోళనలో ఉన్న కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. మృతుల గుర్తింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దిన భారత రాయబార కార్యాలయం.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ బంగ్లాదేశ్ పౌరులే అని ప్రకటించింది. అయితే ఈ ఘటనలో మొత్తంగా 12 మంది గాయపడగా.. అందులో ఓ భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారిక సమాచారం అందింది. అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడి ఘటనలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడంటూ వచ్చిన వార్తలను అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా ఖండించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సమీపంలోని అల్ ఖర్జ్ గవర్నరేట్పై ఆదివారం సాయంత్రం ఒక సైనిక ప్రొజెక్టైల్ వచ్చి పడింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించారని, అని సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రాథమిక సమాచారం ఇచ్చింది. అయితే మృతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సౌదీ అధికారులు తమ నివేదికను సవరించారు

