భారత్‌లోకి చైనా పెట్టుబడులు.. ‘గల్వాన్’ ఘర్షణ తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. ఎట్టకేలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Date:

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై నిబంధనలు, పరిమితుల్ని కొంత వరకు సడలించింది. గతంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం రోజు పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ఇందులో భాగంగానే.. భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే  చైనా సహా భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై కఠిన నిబంధనల్ని సడలించి.. పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, అప్ఘానిస్థాన్, మయన్మార్, పాకిస్థాన్ ఇలా మన పొరుగు దేశాలు.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనల్ని సడలించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు.. పొరుగు దేశాల కంపెనీలు.. భారత్‌లోని ఏ రంగంలోనైనా ప్రభుత్వ అనుమతి లేకుండా 10 శాతం వరకు పెట్టుబడుల్ని పెట్టొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ రూట్‌లో 10 శాతం లోపు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఆ పరిమితి దాటితే మాత్రం అనుమతి ఇప్పటికీ తప్పనిసరిగా ఉంది.

గతంలో మన దేశంలోని ఏ రంగంలో అయినా మన సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండగా.. తాజాగా దీన్ని తొలగించారు. ఈ మేరకు గతంలో తీసుకొచ్చిన ప్రెస్‌నోట్3 ని సవరించారు. ఇక ఎఫ్‌డీఐల విషయంలో రంగాల వారీగా ఉన్న పరిమితులు యథాతథంగానే కొనసాగుతాయని తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...