
మనకు పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటాం. మరి దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ పెట్టుబడి సాధనాల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు, NPS వంటివి ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు ఇలా చాలానే ఉన్నాయి. మరి వీటిల్లో ఏది ఎంచుకోవాలో తెలియక చాలా మంది ఆలోచన దగ్గరే ఆగిపోతుంటారు. అన్నింట్లో గ్యారెంటీ రిటర్న్స్ ఉండవు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మిగతా పోస్టాఫీస్ పథకాలు సహా కొన్ని ప్రభుత్వ మద్దతు పథకాల్లో మాత్రం నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. దీర్ఘకాలంలో మంచి రాబడి కోసం వీటిని పరిశీలించడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్స్ మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తాయని సూచిస్తున్నారు. ఇక్కడ మనకు ఏమేం ఆప్షన్లు ఉన్నాయో చూద్దాం.
ఇది కూడా సురక్షిత పెట్టుబడి పథకం. దీర్ఘకాలంలో ఈక్విటీ ఆధారిత రిటర్న్స్ అందిస్తుంది. ఇది మార్కెట్ లింక్డ్ అయినప్పటికీ.. సురక్షిత సాధనాలైన ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడి ఇస్తుంది. దీర్ఘకాలంలో ఇది సగటున 8-10 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వడం విశేషం. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది చక్కగా సరిపోతుంది. ఇక్కడ కూడా టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

