యుద్ధంతో గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

Date:

యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసివేస్తుండటంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోనూ హోటల్స్ మూతపడనున్నాయనే వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ముడి చమురును ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్పీజీ, సీఎన్‌జీ ధరలు అమాంతం పెరుగుతుండగా.. ఇటీవలె భారత్‌లో గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరగడమే కాకుండా.. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హోటల్స్‌పై ప్రభావం పడి.. మూతపడతాయనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే దేశంలోని పలు కీలక నగరాల్లో రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ కొరతతో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో హోటల్స్ తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఇప్పటికే బెంగళూర్ లో హోటల్స్ మూతపడ్డాయి. చెన్నైలో మూసివేస్తున్నట్లు అక్కడి హోటల్స్ అసోసియేషన్స్ ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. ఇప్పటికే విశాఖలో హోటల్స్ మూసివేత ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...