Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్ ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే ఆ తర్వాత..

Date:

  • గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆకతాయిలు అల్లరి స్థానికులకు ఇబ్బందిగా మారింది.
  • గంజాయి సేవిస్తున్నట్లు స్థానికం అనుమానించారు. దీంతో ఆకతాయిలు అల్లరి, గంజాయి సేవించడంపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ చేసి చెప్పారు. ఆకతాయిలు అల్లరి స్థానికులకు న్యూసెన్స్ గా మారిన విషయాన్ని చెప్పేశారు. ఇక అంతటితో తమ పని అయిపోయిందని స్థానికులు గమ్మనుండిపోయారు.‌
  • అయితే ఫోన్ చేసిన పది నిమిషాలకే గల్లా మాధవి ఆ స్థలంలో వాలిపోయారు‌. బైక్ పై సర్రున దూసుకొస్తున్న ఎమ్మెల్యే ను చూసిన ఆకతాయిలు అక్కడి నుండి పారిపోయారు‌.‌ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వచ్చిన విషయం క్షణాల్లోనే చేరిపోయింది. దీంతో ఎమ్మెల్యే కి ఫోన్ చేసిన మహిళా వచ్చి.. ఆకతాయిలు ఆట కట్టించాలని చెప్పింది. ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నిఘా పెట్టాలని సూచించింది. గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించింది.
  • ఫోన్ కాల్ కే స్పందించి వచ్చిన ఎమ్మెల్యే ను స్థానికులు అభినందించారు. గతంలోనూ పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో నిర్మానుష ప్రాంతానికి పోలీసులతో వెళ్ళి పేకాట రాయుళ్లు, గంజాయి ముఠాని పట్టించారు. సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆమె స్పందిస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...