ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం.. ‘2024 జూన్ 2’ నుంచి ఎందుకు నోటిఫై చేశారో తెలుసా!

Date:

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024 జూన్‌ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదాను కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అయితే 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ఎందుకు నోటిఫై చేశారో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయగా.. న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్‌ 2 నుంచి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. అమరావతి గెజిట్ నోటిఫికేషన్‌లో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించినట్లు పేర్కొనడంపై చర్చ జరుగుతోంది. ఆ డేట్‌ను ఎందుకు ఎంచుకున్నారనే చర్చ మొదలైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే 2024 జూన్ 2తో ఆ గడువు ముగిసింది.. ఈ క్రమంలోనే జూన్ 2 2024 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం, మూడు రాజధానుల ఎపిసోడ్‌కు చెక్ పెడుతూ జూన్ 2 2024 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరించగా.. సీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలు అమరావతికి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చట్టసవరణపై స్పష్టత ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్‌లో రాజధాని అమరావతి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుదంటున్నారు. శాసనసభ చేసే సవరణకు చట్టబద్ధమైన విలువ ఉండదని చెబుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...