రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు పెంచాలని సీఎంకు అనిరుధ్ రెడ్డి లేఖ.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

Date:

ఇప్ప పువ్వు గురించి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను పెంచాలని.. సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్ప చెట్ల పెంపకానికి సంబంధించి.. 52 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ 52 మందిలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. దీంతో మరోసారి రాష్ట్రంలో ఇప్ప పువ్వు వ్యవహారం చర్చకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. ఏకంగా 52 మంది ఎమ్మెల్యేలు.. అనిరుధ్ రెడ్డి చేస్తున్న డిమాండ్‌కు మద్దతుగా సంతకాలు చేయడం గమనార్హం.

ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పేర్కొంటున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల ఈ క్రమంలోనే ఇప్ప పువ్వు చెట్ల ఉద్యమాన్ని చెపట్టారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ డిమాండ్‌కు ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...