ఏపీ ప్రజలపై మరో భారం.. పాలు, పెరుగు ధరలు పెంపు.. కొత్త రేట్లు ఇవే

Date:

ఏపీలో విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచారు. విజయ డెయిరీకి సంబంధించి లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ తెలిపింది. విజయ డెయిరీకి సంబంధించి ఈ ధరలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. సంగం డెయిరీకి సంబంధించి పెంచిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పాలు ధరలు పెరిగాయి.. ఇటీవల రైతులకు పాలసేకరణ ధరలు పెరగడం, వ్యయం పెరగడంతో.. విజయ, సంగం డెయిరీలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్‌లో విజయ లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రకటించింది. ఈ నెల 4 నుంచి పెరిగిన ధరల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నెల 9 వరకు నెలవారీ పాల కార్డు కొనుగోలు చేసిన వారికి మాత్రం పాత ధరలు వర్తిస్తాయి. మొత్త ఏడు రకాల పాల ధరలు పెంచారు. అంతేకాదు పెరుగుపై రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగింది. 10 కేజీల స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ ధర రూ.40 పెరిగింది.

మరోవైపు సంగం డెయిరీ కూడా ప్రస్తుతం ఉన్న ధరకు లీటరు ప్యాకెట్‌పై రూ.2, అర లీటరు ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచింది. పాల ప్యాకెట్లపై పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎండీ గోపాల కృష్ణన్‌ తెలిపారు. పాల సేకరణ, ప్యాకింగ్‌ సామాగ్రి, ఇతర వ్యయాలు పెరిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త ధరల విషయానికి వస్తే.. సంగం గోల్డ్‌ ప్లస్‌ అర లీటర్ ధర రూ.37 కాగా.. రూపాయి పెంచి రూ. 38కి పెరిగింది. హెచ్‌ఎఫ్‌సీఎం గోల్డ్‌ ప్యాకెట్‌ అర లీటరు ధర రూ.36 నుంచి రూ.37కుపెంచారు.. అదే లీటర్ ధ రూ.70 నుంచి 72కు పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...