భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్, జూన్‌లో కాదు అప్పుడే?

Date:

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే రహదారుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వీటికితోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యం కావొచ్చనే వార్తలు వస్తున్నాయి.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకటి, రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఇంటీరియర్ వర్క్స్, ఏటీసీ తుది మెరుగులు పూర్తి కావాల్సి ఉంది. అలాగే ప్రధాన రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ కూడా ఖరారు కావాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఆగస్ట్ నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు.. దేశంలోనే రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందింది. పీపీపీ విధానంలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (GVIAL) దీనిని నిర్మిస్తారు. రూ.4,727 కోట్లతో తొలి దశ పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 3,800 మీటర్ల మేరకు రన్ వే, 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిజ యాత్ర పాడ్స్ ఏర్పాటు చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...