వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద రూల్స్..!

Date:

భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించే వెసులుబాటును నిలిపివేసింది. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేస్తూ ఎన్ హెచ్ఎఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము చెల్లింపులు ఇకపై పూర్తిగా ఫాస్టాగ్, యూపీఐ విధానం ద్వారా జరగనున్నాయి. ఈ నూతన విధానం నేటి నుండి (ఏప్రిల్ ఒకటో తేదీ) నుంచి అమల్లోకి తీసుకు వచ్చింది..

ప్రస్తుతం వాహనదారులు దాదాపుగా 98 శాతం వరకు ఫాస్టాగ్ విధానం (ఫాస్టాగ్, యూపీఐ) లో టోల్ చార్జీలు చెల్లిస్తున్నారు. మిగిలిన రెండు శాతం మంది వాహన దారులు మాత్రమే నగదు చెల్లిస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక తాజా నిర్ణయంతో ఆ రెండు శాతం వాహనదారులు కూడా ఆన్ లైన్ పద్ధతిలోకి రానున్నారు.

ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు తమ ఫాస్టాగ్ (FASTag) ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద మాత్రం ఈ విధానం అమల్లోకి తీసుకురాలేదు. అక్కడ నగదు చెల్లింపులకు అనుమతిస్తారు.

హైవేలపై టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత ప్రయాణంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, టోల్ వసూళ్లలో పారదర్శకత కోసం నగదు చెల్లింపుల విధానాన్ని రద్దు చేసినట్లు హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు. నెట్‌వర్క్ సమస్యల కారణంగా యూపీఐ లావాదేవీలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చని, కాబట్టి ఫాస్టాగ్‌ను ఎల్లప్పుడూ రీఛార్జ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...