CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!

Date:

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ డిమాండ్లను మరింత విస్తరించారు. జూలై 20న శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు.

పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యమం నాలుగు ప్రధాన డిమాండ్లతో కొనసాగుతోందన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, జూలై 20 నిరసనకారులపై కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని తెలిపారు.

ఉద్యమం ఉధృతం కావడంతో ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు పార్టీ వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...