క్యూ4 ఫలితాలపై టీసీఎస్ కీలక ప్రకటన.. డివిడెండ్ కూడా.. ఆల్ టైమ్ కనిష్ఠాల్లో షేరు

Date:

భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. క్యూ4 ఫలితాల్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలపనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫైనల్ డివిడెండ్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి దశకు వచ్చింది. మరో 5 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి.. 2026-27 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక కార్పొరేట్ కంపెనీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ త్రైమాసికాల వారిగా ఫలితాల్ని ప్రకటిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల జనవరిలో క్యూ3 ఫలితాల్ని వెల్లడించింది భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఇప్పుడు జనవరి- మార్చి త్రైమాసికం ముగియనున్న తరుణంలో.. క్యూ4 ఫలితాలపైనా ప్రకటన చేసింది. సాధారణంగా ప్రతిసారీ త్రైమాసికం ముగిసిన వెంటనే ఫలితాల్ని మొదటగా టీసీఎస్ ప్రకటిస్తుంటుంది. ఆ తర్వాత ఇతర ఐటీ కంపెనీలు, ఇతర బ్యాంకులు, ఫార్మా కంపెనీలు వంటివి ఫలితాల్ని విడుదల చేస్తుంటాయి.

2026, ఏప్రిల్ 9న (గురువారం) కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై.. మార్చి 31తో ముగిసిన త్రైమాసికం ఫలితాలకు ఆమోదం తెలిపి.. అదే రోజు ఫలితాల్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాాజాగా టీసీఎస్.. స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో టీసీఎస్.. మరో ప్రకటన కూడా చేసింది. క్యూ4 ఫలితాలతో పాటుగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...