

- ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది మరోసారి ఆధ్యాత్మిక చరిత్రను మెలకువ చేసింది. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో నది గర్భంలో వెలుగుచూసిన శివలింగం, నంది విగ్రహాలు గ్రామస్థుల్లో భక్తి భావం నింపేశాయి. కార్తీకమాసంలో స్వయంగా బయటపడటంతో శివుడే తమ ఊరు వచ్చాడని ఉత్సాహంగా పూజలు ప్రారంభించారు.
- నదీపరివాహక ప్రాంతాలు ప్రాచీన కాలం నుంచి జనావాసాలకు అనుకూలంగా ఉన్నాయి. నదుల పక్కన జనావాసాలు ఏర్పరుచుకోవడానికి కారణం తాగునీటి సౌకర్యం, వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన భూమి ఉండటం ప్రధాన కారణాలు.
- ప్రపంచంలోని మానవ నాగరికతలు చాలావరకు నదులు, సముద్రాల పరీవాహక ప్రాంతాలు, అడవుల్లోని మంచినీటి చెలమలనుంచే ప్రారంభమయ్యాయి. నైలు నది పక్కన ఈజిప్షియన్, టైగ్రిస్-యూఫ్రటీస్ నదుల పక్కన మెసొపొటేమియన్, సింధులోయ నాగరికత సింధు నది ఒడ్డున ఏర్పడ్డాయి.
- ఇక మన దేశంలో గంగా, గోదావరి, కృష్ణ, పెన్న ఇలాంటి నదీపరివాహక నదుల పక్కనే పట్టణాలు, గ్రామాలు ఏర్పడ్డాయి… అలా ఏర్పడిన నదులతో మానవ జీవితాలు ప్రభావితం అవుతుంటాయి… దేవాలయాలు, పూజనీయ, దర్శనీయ ప్రాంతాలు కూడా నదుల పక్కనే ఏర్పడ్డాయి.
- అలాంటి నదుల్లో ప్రాచీన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి… అలాంటి ఓ పురాతన విగ్రహాలు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీపరివాహక ప్రాంతంలో తాజాగా బయటపడ్డాయి.
