
- ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది.
- ఆమె మాటలు నమ్మిన గుంటూరు వాసులు… ఒక్కొక్కరు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ చెల్లించారు. డబ్బులు చెల్లించి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదు. డబ్బులివ్వాలని అడిగితే నావద్ద లేవంటూ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
- మంగళగిరికి చెందిన సుధా రెడ్డి చేసిన మోసంపై బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనకి టిటిడిలో తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పుకున్న సుధారెడ్డి కల్యాణ కట్టలో తలనీలాలు తొలగించే ఉద్యోగాలున్నాయని డబ్బులిస్తే ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పింది. దీంతో చాలా మంది నాయిూ బ్రాహ్మణులు ఆమె మాటలు నమ్మారు.
- దాదాపు 200 మంది బాధితులున్నారు. వీరంతా ఆమె కార్యాలయానికి రావడంతో పోలీసులకు వరకూ ఈ విషయం చేరింది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వం స్పందించి తమకు డబ్బులిప్పించాలని కోరుతున్నారు.
