నేను, పేర్ని నాని చెప్పినా జగన్ వినలేదు.. అందుకే 2019లో గెలిచాం, 2029లో మళ్లీ ఆయనే సీఎం’: కొడాలి నాని

Date:

కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్‌ విలువ ఏపీ ప్రజలకు తెలిసొస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువ ఏంటో తెలిసిందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని . జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని.. ఆయన ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేద వర్గాలు భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదని.. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చెల్లెళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి అనవసరమైన నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోతే ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని ఇప్పటి వరకు చూశామని.. కానీ తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్‌ అంటూ ప్రశంసించారు. జగన్ తన చెల్లెళ్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని.. కానీ వారు మాత్రం జగన్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...