నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

Date:

తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు విడుదల చేయగా.. నేడు సుమారు 68.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. నేడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో ఆదివారం (మార్చి 22) సీఎం రేవంత్‌ రెడ్డి బటన్‌ నొక్కి నిధుల విడుదల చేయగా.. ఆదివారం సెలవుదినం కావడంతో నేడు ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులను పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తుండగా.. ఈ డబ్బులను రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున తాజాగా నిధులు విడుదల చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఆమేరకు బ్యాంకుల నుంచి రైతులకు మేసేజ్‌లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...