నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

Date:

తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు విడుదల చేయగా.. నేడు సుమారు 68.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. నేడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో ఆదివారం (మార్చి 22) సీఎం రేవంత్‌ రెడ్డి బటన్‌ నొక్కి నిధుల విడుదల చేయగా.. ఆదివారం సెలవుదినం కావడంతో నేడు ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులను పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తుండగా.. ఈ డబ్బులను రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున తాజాగా నిధులు విడుదల చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఆమేరకు బ్యాంకుల నుంచి రైతులకు మేసేజ్‌లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...