హైదరాబాద్ వెళ్లే వారికి ఊరట.. కొత్త నేషనల్ హైవే 565తో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, యర్రగొండపాలెంవాసుల ఏళ్ల కష్టానికి తెర

Date:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా.. యర్రగొండపాలెం దగ్గర 20 కిలో మీటర్ల రోడ్డును విస్తరించారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఊరట దక్కింది. ఈ 20 కిలో మీటర్లు అటవీ ప్రాంతం మీదుగా వెళుతోంది.. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవే 565 కీలకంగా మారింది. ఈ హైవే తెలంగాణలోని నకిరేకల్ దగ్గర జాతీయ రహదారి 65 దగ్గర మొదలై.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏర్పేడు దగ్గర నేషనల్ హైవే 71 దగ్గర ముగుస్తుంది. ఈ హైవే నల్గొండ, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూపురు, వెంకటగిరి, ఏర్పేడు మీదుగా వెళుతోంది. అయితే గతంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ రాత్రిళ్లు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా పుల్లల చెరువు దగ్గర నుంచి వెల్దుర్తి మండలం వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండేది.. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. అయితే జాతీయ రహదారి 565 నిర్మాణంతో ఆ కష్టాల నుంచి ఊరట దక్కింది. ఈ రోడ్డు అభివృద్ధి చేయడంతో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం మరింత సులభతరం అయ్యింది.

ఈ రూట్‌లో..ఎన్‌హెచ్‌-565లో భాగంగా ఉన్న ఈ 20 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అటవీ అనుమతులతో పాటుగా మరికొన్ని అడ్డంకులు వచ్చాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో.. గతేడాది పనులు ప్రారంభించి వేగవంతం చేశారు. ఈ రోడ్డును టార్గెట్ కంటే ముందే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోడ్డలో అటవీ ప్రాంతం మీదుగా కొండలు, లోయల మధ్యలో నుంచి వెళుతుంటే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...