హైదరాబాద్ వెళ్లే వారికి ఊరట.. కొత్త నేషనల్ హైవే 565తో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, యర్రగొండపాలెంవాసుల ఏళ్ల కష్టానికి తెర

Date:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా.. యర్రగొండపాలెం దగ్గర 20 కిలో మీటర్ల రోడ్డును విస్తరించారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఊరట దక్కింది. ఈ 20 కిలో మీటర్లు అటవీ ప్రాంతం మీదుగా వెళుతోంది.. బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లతో ప్రయాణం సాఫీగా సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవే 565 కీలకంగా మారింది. ఈ హైవే తెలంగాణలోని నకిరేకల్ దగ్గర జాతీయ రహదారి 65 దగ్గర మొదలై.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏర్పేడు దగ్గర నేషనల్ హైవే 71 దగ్గర ముగుస్తుంది. ఈ హైవే నల్గొండ, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూపురు, వెంకటగిరి, ఏర్పేడు మీదుగా వెళుతోంది. అయితే గతంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ రాత్రిళ్లు అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా పుల్లల చెరువు దగ్గర నుంచి వెల్దుర్తి మండలం వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండేది.. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవి. అయితే జాతీయ రహదారి 565 నిర్మాణంతో ఆ కష్టాల నుంచి ఊరట దక్కింది. ఈ రోడ్డు అభివృద్ధి చేయడంతో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం మరింత సులభతరం అయ్యింది.

ఈ రూట్‌లో..ఎన్‌హెచ్‌-565లో భాగంగా ఉన్న ఈ 20 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అటవీ అనుమతులతో పాటుగా మరికొన్ని అడ్డంకులు వచ్చాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో.. గతేడాది పనులు ప్రారంభించి వేగవంతం చేశారు. ఈ రోడ్డును టార్గెట్ కంటే ముందే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోడ్డలో అటవీ ప్రాంతం మీదుగా కొండలు, లోయల మధ్యలో నుంచి వెళుతుంటే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...