Gold Price Crash: 43 ఏళ్ల రికార్డ్ బ్రేక్ కుప్పకూలిన బంగారం, వెండి త్వరలో మరింత తగ్గే ఛాన్స్!

Date:

సాధారణంగా బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గడం చాలా వరకు జనాలు చూసి ఉండరు. గత రెండు, మూడేళ్ల క్రితం తలం బంగారం ధర రూ.60వేలుగా ఉండగా ఇప్పుడు ఇది రూ.1,50లక్షల దాకా చేరింది. కానీ గడిచిన గత వారం రోజుల్లో ఏకంగా బంగారం ధరలు పాతాలానికి పడిపోయాయి.

ఇది బంగారం మార్కెట్‌లోలో బిగ్ ఎర్త్ క్వేక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బంగారం ధరలు కుప్పకూలాయి. అసలు బంగారం ధరల పథనానికి అసలు కారణం ఏంటో చూద్దాం పదండి.

గత కొన్ని నెలలుగా వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పాతాళానికి పడిపోయాయి. కేవలం వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 5,200 డాలర్ల నుంచి 4,400 డాలర్లకు పడిపోయింది. ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసిన అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పడిపోవడంతో. దేశీయ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.ఈ దెబ్బతో గోల్డ్ లోన్ తీసుకున్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారికి.. బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ మొదలయ్యాయి.

బంగారం ధరలు తగ్గడంతో ఎల్‌టీవీ రేషియో పెరిగిపోయి.. అదనపు నగలు లేదా నగదు కట్టాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు వెండి ధరలు కూడా బేజారెత్తిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో వెండి కిలోకు ఏకంగా 12 శాతం మేర పతనమైంది.

ఇరాన్ టెన్షన్ల వల్ల క్రూడాయిల్ సరఫరాపై పెట్రోలియం శాఖ ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది.రష్యా, టర్కీ లాంటి దేశాలు తమ గోల్డ్ రిజర్వులను మార్కెట్‌లో అమ్మేస్తుండటంతో. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధర 4,100 డాలర్ల మార్కుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...