ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌‌కు తీపికబురు.. సఖి నివాస్‌ల పేరుతో 30 హాస్టల్స్, ఉత్తర్వులు జారీ

Date:

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరుతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఖర్చుతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా వీటిని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్స్‌కు వసతి కల్పించేందుకు సఖి నివాస్ పేరుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయనుంది. మొత్తం 30 సఖి నివాస్ (వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లు) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సఖి నివాస్‌లో 30మందికి వసతి కల్పించనున్నారు.. అవసరమైన సిబ్బందిని కూడా నియమించనున్నారు. సఖి నివాస్‌లో డార్మెటరీతో పాటు సింగిల్, డబుల్ గదులు ఏసీ నాన్ ఏసీ గదులు ప్లాన్ చేస్తున్నారు. రిక్రియేషన్ హాలు, ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సిక్ రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఒక్కో హాస్టల్‌కు మేనేజర్, వార్డెన్, కేర్ టేకర్లు, సెక్యూరిటీ గార్డు, నైట్‌ గార్డు పోస్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సఖి నివాస్‌కు మొత్తం 8 పోస్టులు ఉంటాయి. ఈ మేరకు నెలకు రూ.84000, ఏడాదికి రూ.10.08 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ హాస్టల్స్‌లో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్‌ కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ సఖి నివాస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయాలు అందుబాటులోకి రానుంది. అలాగే చదువుకునే యువతులకు కూడా ఈ సఖి నివాస్‌లో సదుపాయం కల్పిస్తారు. రాష్ట్రంలో సఖి నివాస్‌లు ఏర్పాటు చేయాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హాస్టల్స్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...