ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఆర్డీటీకి గ్రీన్‌‌సిగ్నల్, FCRI రెన్యువల్‌‌పై ఆదేశాలు

Date:

కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద విదేశీ నిధులకు బ్రేకులు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి రిక్వెస్ట్ చేయడంతో మళ్లీ రెన్యువల్ చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

తెలుగు రాష్ట్రాలకు, అనంతపురం జిల్లావాసులకు కేంద్రం నుంచి తీపికబురు అందింది. అనంతపురం ఆర్డీటీ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌) సేవలకు అనుమతి వచ్చింది. ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా.. ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం ఇచ్చింది. ఆర్డీటీకి లైన్ క్లియర్ అయ్యిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఆర్డీటీ విదేశీ నిధుల విషయంలో సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎన్నో సేవలు అందిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్డీటీకి విదేశాల నుంచి వస్తున్న నిధుల వినియోగించేందుకు అంతరాయం కలిగిందని.. ఆర్డీటీ అందించే సేవల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. ఆయన స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి విన్నవించగానే సానుకూలంగా స్పందించిన కేంద్రానికి.. ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...