తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్! సంక్రాంతికే రైతు భరోసా డబ్బులు! కానీ, ఒక్క కండిషన్!

Date:

తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇచ్చే ఈ సాయాన్ని పక్కాగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతను వాడుతూ భారీ ప్రక్షాళనకు తెరలేపింది.

పథకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి ‘శాటిలైట్ మ్యాపింగ్’ సర్వేను ఆయుధంగా ఎంచుకుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) టెక్నాలజీ ద్వారా ఏ భూమిలో పంట సాగవుతోంది? ఏది బీడు భూమి? అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య భవనాలు ఉన్న భూములకు కూడా గతంలో రైతు భరోసా నిధులు వెళ్లినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు పక్కా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని డిసైడ్ అయింది.

అన్నదాతలకు పండుగ తీపి కబురు అందిస్తూ.. సంక్రాంతి పండుగ లోపు అంటే జనవరి 13 లేదా 14వ తేదీలలో డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటికే నిధులు సిద్ధం చేసిన ప్రభుత్వం.. సర్వే నివేదిక అందగానే లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయనుంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...