తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై..

Date:

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం, కాలేజీ యాజమాన్యాల బంద్‌ల నేపథ్యంలో ప్రభుత్వం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 16 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు దక్కింది. కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది.

గత కొంతకాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీనివల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. సమయానికి నగదు అందకపోవడంతో యాజమాన్యాలు తరచుగా బంద్‌లకు పిలుపునిస్తున్నాయి. చర్చల తర్వాత ప్రభుత్వం వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ఈ జాప్యం పునరావృతమవుతోంది. ఈ తరహా ఘటనలు విద్యార్థులపై, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ప్రముఖ ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు కల్పించారు.కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వారి నుంచి ముగ్గురు ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....