విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 14 కి.మీ. ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌, ఈ మార్గంలోనే..

Date:

విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్‌ వరకు 14 కి.మీ. ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ కారిడార్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేలా ప్రతిపాదన తీసుకురాగా.. త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ మేరకు కొత్త ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయ రహదారిలో విజయవాడ నగర పరిధిలో ఉన్నంత మేరకు.. ఆ మార్గంలో ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించే ప్రతిపాదనను సర్కార్ పరిశీలిస్తోంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ సమీపంలోని రాజీవ్‌ పార్క్‌ వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ నుంచి మెుదలుకొని మచిలీపట్నం వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు మెుత్తంగా 14 కి.మీ. మేర ఈ పైవంతెన నిర్మించాలని భావిస్తున్నారు. ఆరు వరుసలతో నిర్మించే ఫ్లై ఓవర్ కారణంగా హైవేలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలూ ఉండవని, విజయవాడ నగర ట్రాఫిక్‌ కష్టాలకు చెక్ పడుతుందని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎలా చేపట్టవచ్చన్న భిన్న ప్రణాళికలపై ఢిల్లీ స్థాయిలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చిస్తున్నారు.

హైదరాబాద్‌- విజయవాడ- మచిలీపట్నం హైవే-65పై విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్‌ సర్కిల్, ఆటోనగర్‌ గేట్, కానూరు, పోరంకి, పెనమలూరు మీదుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఎన్‌హెచ్-65ను నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రాజెక్ట్‌ చేపట్టారు. దీన్ని గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్‌ క్రాస్‌ అయ్యే పాయింట్‌ వరకే విస్తరించాలని ముందుగా భావించారు. ఆ తర్వాతా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ దాకా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకుంది. ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. విజయవాడ-మచిలీపట్నం హైవేను ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌ కూడా చేపడుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...