ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు చంద్రబాబు కీలక ప్రకటన

Date:

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, కొత్త ఇళ్ల ముంజూరుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నట్లు కలెక్టరల్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూశామని, త్వరలోనే మరింతగా తగ్గించి ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు.

సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల సామాన్యులపై ధరల భారం తగ్గి లబ్ది చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ట్రూడౌన్ విధానం పాటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

వచ్చే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇక పేదలకు ఇళ్ల మంజూరుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలో రానున్న ఉగాది నాటికి 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతగా అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ 20 నెలల పాలనలో తాము అనేక మార్పులు పాలనాపరంగా చేసినట్లు స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమల్లో పొరపాట్లు జరగకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు.

2047 స్వర్ణాంధ్ర విజన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా 10 సూత్రాల అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...