ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు చంద్రబాబు కీలక ప్రకటన

Date:

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, కొత్త ఇళ్ల ముంజూరుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నట్లు కలెక్టరల్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూశామని, త్వరలోనే మరింతగా తగ్గించి ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు.

సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల సామాన్యులపై ధరల భారం తగ్గి లబ్ది చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ట్రూడౌన్ విధానం పాటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

వచ్చే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇక పేదలకు ఇళ్ల మంజూరుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలో రానున్న ఉగాది నాటికి 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతగా అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.

ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ 20 నెలల పాలనలో తాము అనేక మార్పులు పాలనాపరంగా చేసినట్లు స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమల్లో పొరపాట్లు జరగకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు.

2047 స్వర్ణాంధ్ర విజన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా 10 సూత్రాల అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...