
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. సూర్యుడు, గరుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. మిథునంలో బుధుడు తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశిలో ఉన్న శుక్రుడు మీ ఆత్మవిశ్వాసం పెంచి, కొత్త ఆలోచనలు, సంబంధాలను మెరుగుపరచనున్నాడు. మీన రాశిలో ఉండే శని క్రమశిక్షణ ప్రాముఖ్యతను, కుంభంలో ఉన్నరాహువు కొత్త విషయాల గురించి కొన్ని రాశుల వారిని ప్రోత్సహించనున్నాడు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే, సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తారు. మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు.
మీరు అందరి మద్దతు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీరు చేసే పనుల్లో పురోగతి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిగత సంబంధాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. స్నేహితులు, సహోద్యోగులతో పరస్పర నమ్మకం బలపడుతుంది.
వృషభ రాశి వారు ఈరోజు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఒకేసారి అనేక పనులు చేయాల్సి రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలానికి అనుగుణంగా పోతున్నప్పటికీ, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని భావిస్తారు. ఇదే రాశిలో కుజుడి సంచారం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు.
వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈరోజు ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. ఇతరులతో సామరస్యంగా ముందుకు సాగాలి. ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి.

