GATE 2027లో భారీ మార్పులు.. కొత్త సిలబస్‌, రోబోటిక్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఇంకా..

Date:

ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక సమాచారం. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2027 పరీక్ష షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్‌ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరు రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 2026 ఆగస్టు మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది..

ఐఐటీ మద్రాస్‌ జారీ చేసిన తాజా షెడ్యూల్‌ ప్రకారం GATE 2027 పరీక్షలు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఈ సారి విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ కోఆర్డినేషన్‌ బోర్డ్‌-GATE తరఫున ఐఐటీ మద్రాస్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దేశంలోని ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc) సంయుక్తంగా GATE పరీక్షను నిర్వహిస్తున్నాయి. 1983లో ప్రారంభమైన ఈ పరీక్షకు ఈ ఏడాది 45వ ఎడిషన్‌ పరీక్ష జరగనుంది. యేటా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు GATE పరీక్షకు హాజరవుతున్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలు, సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 2026 ఆగస్టు మధ్యలో ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక GATE 2027 పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి దరఖాస్తుల ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. అభ్యర్థుల గుర్తింపు ధ్రువీకరణను మరింత పటిష్టం చేసేందుకు డిజిలాకర్‌ (DigiLocker), ముఖ గుర్తింపు ధ్రువీకరణ (Facial Recognition) విధానాలను అనుసంధానం చేయనున్నారు.

గేట్‌ సిలబస్‌లో భారీ మార్పులు

GATE 2027లో ప్రధాన మార్పుగా అన్ని పేపర్ల సిలబస్‌ను సవరించారు. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సిలబస్‌లో మార్పులు చేయడం గమనార్హం. కొత్త అంశాల చేర్పు, పాత అంశాల తొలగింపు కారణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్త సిలబస్‌కు అనుగుణంగా అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌కు ప్రత్యేక పేపర్‌

సాంకేతిక రంగాల్లో ఆటోమేషన్‌, కృత్రిమ మేధస్సు (AI), స్మార్ట్‌ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (RA) పేపర్‌ను ప్రవేశపెట్టారు. రోబోటిక్స్‌, తయారీ రంగ ఆటోమేషన్‌, ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ వంటి భవిష్యత్‌ రంగాల్లో నిపుణుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ (TF) పేపర్‌ను ఇప్పుడు ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (XE) కింద సెక్షనల్‌ పేపర్‌గా మార్చారు. అయితే మొత్తం పరీక్ష పేపర్ల సంఖ్య 30గానే కొనసాగుతుంది. అభ్యర్థులు అనుమతించిన కాంబినేషన్ల ప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు.

GATE 2027 పరీక్ష రాయాలంటే ఏమేం అర్హతలు ఉండాలి?

GATE 2027కు అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష విధానంలోనూ మార్పులు లేవు. GATE 2027 పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రతి పేపర్‌లో మొత్తం 65 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 15 మార్కులు (అందరికీ తప్పనిసరి), ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి ఎక్కువ ఇంజినీరింగ్‌ పేపర్లలో 13 మార్కులు కేటాయిస్తారు.MCQ ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. MSQ, NAT ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. GATE పరీక్షను యథావిధిగా ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే నిర్వహించనున్నారు. మొత్తంగా GATE 2027లో సిలబస్‌ మార్పులు, రోబోటిక్స్‌ కొత్త పేపర్‌, డిజిలాకర్‌-ఫేషియల్‌ వెరిఫికేషన్‌ వంటి మార్పులు ఈసారి అభ్యర్థుల సిద్ధత విధానంపై ప్రభావం చూపనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....