మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్

Date:

తమ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో ఈరోజు (మంగళవారం) ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు.

లోకేశ్ చేతుల మీదుగా మూడువేల మందికి ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు రూ.1000కోట్ల ఆస్తిని ఇళ్లపట్టాల రూపంలో అందసినట్లు లోకేశ్ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూ.1. ఉంటే ఖర్చు రూ.1.60పైసలుగా ఉందని వివరించారు. రెండేళ్ల అభివృద్ధితో ఖర్చు రూ.1.40కి చేరిందని తెలిపారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని లోకేశ్ ఉద్ఘాటించారు. 2019లో తన ఓటమికి సీఎం చంద్రబాబును కూడా కొంతమంది అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో నంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...