
దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు.. విక్రయాలు పెంచుకునేందుకు ఆఫర్లు తీసుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలలో పలు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు వెర్నా ఐవీటీ మోడల్పై తగ్గింపులు అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అవసరాలు అలా పెరిగిపోవడమో లేదా.. కార్ల ధరలు తగ్గడమో.. ఆదాయం పెరగడమో.. ఇలా ఏదైనా కారణం కావొచ్చు. కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపైకి వచ్చే కార్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే గతేడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని భారీగా తగ్గించింది. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇంకా అదనంగా సెస్ కూడా తొలగించింది. ఈ క్రమంలో వెంటనే కార్ల తయారీ కంపెనీలు ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేశాయి. దీనికి అదనంగా ఇతర ఆఫర్లను కూడా అందించాయి. దీంతో 2025 సెప్టెంబర్- అక్టోబరులో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రికార్డులన్నీ బద్దలు కొట్టాయి
ఇంకా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుండగా.. ఇదే సమయంలో పాత మోడల్స్ను వేగంగా విక్రయించేందుకు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. సాధారణంగా ఇయర్ ఎండ్ వేళ ఇలా ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు ఏప్రిల్ నెలకుగానూ తన వేర్వేరు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు తగ్గింపులు ఇస్తుండటం విశేషం.

