Viral News: ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా.. వైరల్ అవుతున్న ‘బ్లాక్ బోర్డ్’ ఫోటో

Date:

ఎండలు దంచికొడుతున్నా.. చల్లగా కొబ్బరి నీళ్లు తాగుదామని వెళ్తున్నారా?.. జాగ్రత్త ఇప్పుడు వాటి రేట్లు సూర్యుడి వేడి కన్నా గరం గరంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో వ్యాపారులు అమాంతం రేట్లను పెంచేశారు. బెంగళూరు నగరంలో ఏకంగా లీటర్ కొబ్బరి నీరు రూ.180కి అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో తెగవైరల్ అవుతుంది. ఇంతకూ అసలు మ్యాటర్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం పదండి.

మార్చి ముగిసింది.. ఏప్రిల్ స్టార్ట్ అయింది. దీంతో భానుడి భగభగలు మరింత పీక్స్‌కు చేరుకున్నాయి. ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలోనూ ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాలను, ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన వ్యాపారులు కొబ్బరి బోండాం రేట్లను అమాంతం పెంచేశారు. బెంగళూరులో కొబ్బరి నీళ్లను లీటర్లలో అమ్ముతూ.. ఏకంగా లీటర్ కొబ్బరి నీళ్లకు రూ.180 వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా మనం కొబ్బరినీళ్లని కాయల లెక్కన కొంటాం. కానీ బెంగళూరులో సీన్ మారింది.. డిమాండ్‌ను చూసి వ్యాపారులు లీటర్ల లెక్కన కొబ్బరి నీళ్లను అమ్మడం స్టార్ట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో లో ఒక రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నల్లబోర్డుపై 1 లీటర్ రూ. 180 అని రాసి ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు (Peak Bengaluru) అనే ట్యాగ్‌తో దీన్ని వైరల్ చేస్తుండగా.. మరికొందరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.

ఒక యూజర్‌ కామెంట్ చేస్తూ మా ఊర్లో 50 రూపాయలకే దొరుకుతుంది, ఇది మరీ దోపిడీ అనగా.. ఇది కేవలం బెంగళూరులోనే సాధ్యం అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. లీటర్ల లెక్కన అమ్మడం వల్ల మోసం ఉండదు, ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు, ప్యాకింగ్ కూడా శుభ్రంగా ఉంటుంది అని మరికొందరు కామెంట్ చేశారు.

బెంగళూరులో జీవన వ్యయం, ట్రాఫిక్ మాత్రమే కాదు, ఇప్పుడు ఎలనీళ్ల ధర కూడా ఆకాశాన్ని తాకుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఒక కొబ్బరి కాయలో 200 నుంచి 400 మి.లీ వరకు నీరు ఉంటుంది. అంటే ఒక లీటర్ కావాలంటే దాదాపు 3 నుంచి 5 కాయలు అవసరమవుతాయి. కాయ 50-60 రూపాయలు అనుకున్నా, లీటర్ ధర 180 ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...