
2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసిన శాంసన్, నాకౌట్ మ్యాచ్ల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు బెంచ్పైనే కూర్చోవాల్సి వచ్చిన తన ప్రయాణం ఇప్పుడు కల నిజమైనట్టు అనిపిస్తోందని భావోద్వేగంగా తెలిపాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా రికార్డు స్థాయిలో 255/5 స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో నమోదైన అత్యధిక స్కోర్. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా, సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.
నాకౌట్ దశలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేయడం ద్వారా భారత్ టైటిల్ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తర్వాత సంజూ శాంసన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. అహ్మదాబాద్లో లక్ష మందికి పైగా అభిమానులు ఉన్న స్టేడియంలో మాట్లాడిన అతను ఈ క్షణాన్ని కల నిజమైనట్టుగా భావిస్తున్నానని చెప్పాడు.

