‘ఐఐఎం విశాఖ’కు అంతర్జాతీయ గుర్తింపు.. లండన్ బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌

Date:

విశాఖపట్నం ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. లండన్ బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ నుంచి ఐఐఎంవీ అక్రిడిటేషన్‌ లభించింది. ఐదేళ్ల కాలానికి ఈ అక్రిడిటేషన్ దక్కింది. ఈ గుర్తింపుతో ఐఐఎంవీ ప్రపంచస్థాయిలో ప్రతిష్ట మరింత పెరిగిందని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. అందరి సమిష్టి కృషితో ఇది సాధ్యమైంది అన్నారు.

విశాఖపట్నం ఐఐఎం (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక బీజీఏ (బిజినెస్‌ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్‌) విశాఖపట్నం ఐఐఎంకు ఐదేళ్ల అక్రిడిటేషన్‌ వచ్చింది. బీజీఏ నుంచి అక్రిడిటేషన్‌ లభించినట్లు ఐఐఎంవీకి సమాచారం అందింది. అత్యున్నత విద్యా ప్రమాణాలను పాటించే విద్యా సంస్థలకు ఈ గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితాలో ఐఐఎంవీ చేరిందని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం చంద్రశేఖర్‌ తెలిపారు. ఐఐఎం విద్యార్థుల భాగస్వామ్యం, టీచింగ్, నాన్ టీచింగ్ సమిష్టి కృషితో అక్రిడేషన్ సాధ్యమైంది అన్నారు.

ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో తమ నిబద్ధతకు నిదర్శనమని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, అభివృద్ధి ఐఐఎం విలువలని.. ఈ అక్రిడిటేషన్‌ వాటిని మరింత ప్రతిబింబిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ గుర్తింపుతో ప్రపంచస్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ఐఐఎంలో విద్యావిధానం, విద్యార్థుల భాగస్వామ్యం, అధ్యాపకుల నైపుణ్యం, పరిపాలన వంటి పలు అంశాలను బీజీఏ పరిశీలించిన తర్వాతే అక్రిడిటేషన్‌ ఖరారు చేశారన్నారు. ఐఐఎంవీలో వినూత్నమైన విద్యా ప్రణాళిక, స్టార్టప్‌లకు ఇస్తున్న ప్రోత్సాహంతో పాటుగా విద్యాబోధనను నిపుణుల బృందం ప్రశంసించినట్లు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...