3 నెలల్లోనే 25 శాతం పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు

Date:

భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కొంత కాలంగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు నెలకొన్నాయి. దీంతో పెద్ద పెద్ద స్టాక్స్ కూడా దారుణంగా పతనం అయ్యాయి. అయితే ఇందులో ప్రముఖంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు గురించి తెలుసుకోవాలి. ఇది ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 25 శాతం కుదేలైంది. ఈ స్టాక్ పతనానికి ఇతర చాలా కారణాలే ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలో మాత్రం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తుంటాయి. ఇంకా.. అంతర్జాతీయంగా అనిశ్చితి.. ఇతర అంశాలతో కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతుంటాయి. గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. గతేడాది జనవరిలో బాధ్యతలు చేపట్టాక.. స్టాక్ మార్కెట్లు అప్పటినుంచి పడుతూనే ఉన్నాయి. దిగుమతి సుంకాల్ని పెంచగా.. స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఇతర దేశాలతో కవ్వింపులు.. చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవల మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం మరింత ఒత్తిడిని పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో మరింత భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ మార్చి నెలలోనే 10 శాతానికిపైగా పడిపోయింది. దీంతో పలు హెవీ వెయిట్ స్టాక్స్ ఎస్బీఐ, రిలయన్స్ సహా ఐటీ స్టాక్స్ ఇలా అన్నీ భారీగా పడిపోయాయి. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ అధికంగా ప్రభావితమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...