
పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు ఇటీవల ట్రంప్ ప్రకటన తర్వాత మళ్లీ ఒక్కసారిగా భారీగా తగ్గగా అది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా స్వల్పంగా ధరలు పెరిగాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది చెప్పొచ్చు. గతేడాది అంతర్జాతీయంగా అనిశ్చితి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం సహా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం కిందటేడాది 70 శాతం వరకు.. సిల్వర్ 150 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది కూడా ఆరంభంలో భారీగానే పెరగ్గా.. మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లు దిగొచ్చాయి. ఇక్కడ క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ద్రవ్యోల్బణం భయాలు పెరిగి.. డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు దిగొచ్చాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కాస్త పెరిగి 4,676 డాలర్ల స్థాయిలో ఉంది. అంతకుముందు ఇది 4,600 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు కూడా 73 డాలర్ల స్థాయికి పెరిగింది. దీంతో దీనికి అనుగుణంగానే దేశీయంగా మళ్లీ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది.

