ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బిగ్ షాక్ తొలగింపుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై వారికే..

Date:

ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి షాకింగ్ న్యూస్. పింఛన్ల పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అనర్హుల పింఛన్లను తొలగించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ పథకం ద్వారా వృద్దులకు ప్రతీ నెలా రూ.4 వేలు అందిస్తుండగా.. అంగవైకల్యంతో బాధపడేవారికి రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు అందిస్తోంది.

ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి లబ్దిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇక 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పింఛన్‌దారులకు అందిస్తున్నారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పింఛన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వీరి పింఛన్లు తొలగింపు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్నవారు గందరగోళానికి గురయ్యేలా షాకింగ్ ప్రకటన చేసింది ప్రభుత్వం. పింఛన్లు పొందుతున్నవారిలో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హుల పింఛన్లను తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ దీని గురించి తాజాగా ప్రకటన చేశారు.

ఈ నిర్ణయం ద్వారా పథకంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక అనర్హులపై ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చని, కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. నిజమైతే నిర్ధారణ అయితే వెంటనే పింఛన్ తొలగించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...