
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ 20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో ఒక్క ఓటమి భారత్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. టీమిండియా తదుపరి మ్యాచ్ల్లో భారీ గెలుపుతో పాటు, ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మరో మ్యాచ్ ఫలితం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలని భారత్ కోరుకుంటుంది.
ABN , Publish Date – Feb 26 , 2026 | 08:01 AM

