Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!

Date:

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి, వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.50 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు.

దుండగులు ఇంట్లోని మహిళలను కత్తులు, పిస్టళ్లతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం ఇంటి ముందు ఉన్న రెండు బైకులను కూడా తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ వివాదాలు, వృత్తిపరమైన దొంగల ప్రమేయం సహా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...