మగువల కళ్లకు మెరుపునిచ్చే కాటుక సీక్రెట్స్‌, మహిళలు కళ్లకు కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Date:

భారతీయ మహిళల అందం గురించి చెప్పాలంటే కళ్లకు పెట్టుకునే కాటుక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నేటి కాలంలో కాజల్ కేవలం మేకప్‌లో భాగంగా మారిపోయినా, ఒకప్పుడు అది భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం, సంప్రదాయంలో విడదీయరాని భాగంగా ఉండేది. కళ్ల అందాన్ని పెంచడమే కాకుండా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం, దృష్టిదోషం నుంచి రక్షణ కల్పించడం వంటి కారణాలతో కూడా దీనిని ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో కళ్లకు కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మన ముఖానికి చక్రాల్లాంటి కళ్లు ఎంత అందమో.. కళ్లకు కాటుక కూడా అంతే అందం. అందుకే కాజల్‌ అప్లయ్‌ చేయకుండా మేకప్‌ కూడా పూర్తి కాదు మరి. ఇది ఇప్పటి  కాదు వేల సంవత్సరాల క్రితమే భారతీయ మహిళలు కాటుకను తమ నిత్య జీవితంలో భాగంగా మార్చుకున్నారు. అప్పట్లో ఇది ఫ్యాషన్ కోసమే కాదు, కంటి సంరక్షణ, సంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉండేది.

చరిత్రకారుల ప్రకారం సింధు నాగరికత కాలం నుంచే భారతీయులు కాటుకను ఉపయోగించేవారు. అప్పట్లో మహిళలే కాకుండా పురుషులు, చిన్నారులు కూడా కాటుక పెట్టుకునేవారని ఆధారాలు సూచిస్తున్నాయి. అందుకే ప్రాచీన భారతీయ మహిళలు కాటుక లేకుండా ఇంటి గడప దాటేవారు కాదని చరిత్ర చెబుతోంది. మరి కాటుకకు అంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాటుక చరిత్ర సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వకాలంలో ఆముదం నూనె, లేదా వచ్చే మసిని సేకరించి, అందులో కర్పూరం, గంధం వంటి సహజ పదార్థాలు కలిపి కాటుక తయారు చేసేవారు. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాకుండా రోజువారీ జీవనంలో భాగంగా ఉండేది. ఆయుర్వేద గ్రంథాల్లో కూడా అంజనాన్ని కంటి సంరక్షణలో ఉపయోగించే పదార్థంగా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....