పుట్టినరోజు వేళ అనంత్ అంబానీ గొప్ప మనసు.. ఆవుల కోసం రూ. 10 కోట్లు విరాళం.. గజరాజులకు విందు

Date:

దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఏప్రిల్ 10న 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కొంత కాలంగా పలు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న అనంత్ ఇప్పుడు బర్త్‌డేకు ముందు కూడా గుజరాత్‌లోని ఒక ఆలయానికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇక్కడ ఆవులకు గోశాల నిర్మాణం కోసం ఇవ్వడం విశేషం.

సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో స్వీడన్‌ సంస్థ డెలావల్ సహకారంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ సుమారు 500 వరకు ఆవులు వసతి పొందేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును అంబానీ కుటుంబమే చూసుకుంటోంది. ఏకైక దాతగా వీరే ఉన్నారు. అనంత్ అంబానీకి మూగజీవాల పట్ల విపరీతమైన ప్రేమ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా ఆవుల కోసం తన పుట్టినరోజుకు ముందు విరాళం ఇచ్చి మరోసారి ప్రేమను చాటుకున్నారు.

ఇదే సమయంలో రాజస్థాన్‌ జైపూర్ శివార్లలో హాథీ గావ్‌లో అనంత్ అంబానీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వన్యప్రాణుల కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా హాథీ గావ్ వికాస్ సమితి వినూత్నంగా వేడుకను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం ఇక్కడ అరటిపండ్లు, చెరకు, బెల్లం, పుచ్చకాయలు, ఆపిల్స్, బొప్పాయి ఇలా దాదాపు 3 వేల కిలోల పండ్లతో భారీ బఫే ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా బాబు, చంద, పుష్ప అనే 3 ఏనుగులు.. వాటి తొండాలతో అనంత్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక వేడుక కోసం దాదాపు 100 ఏనుగుల్ని రాజస్థానీ సంప్రదాయ పద్ధతిలో రంగురంగుల దుస్తులు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...