
హైదరాబాద్ నగరం నుంచి తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు. యాత్రికుల కోసం సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి 19 యాత్రలు అందుబాటులో ఉంచారు. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో చూడొచ్చు
చాలా మంది తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటుంటారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావటంతో కొందరు వెనకడుగు వేస్తే.. మరికొందరు వాయిదాలతో కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో తీర్థయాత్రలు చేసేందుకు సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి తీర్థయాత్రలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సదుపాయం కల్పిస్తోంది. సాధారణ ప్రయాణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువకే ఈ టికెట్ లభిస్తుంది. దానికి బోనస్గా అనేక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి 19 యాత్రలు అందుబాటులో ఉన్నాయి.
చాలా మంది తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటుంటారు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావటంతో కొందరు వెనకడుగు వేస్తే.. మరికొందరు వాయిదాలతో కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో తీర్థయాత్రలు చేసేందుకు సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి తీర్థయాత్రలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సదుపాయం కల్పిస్తోంది. సాధారణ ప్రయాణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువకే ఈ టికెట్ లభిస్తుంది. దానికి బోనస్గా అనేక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి 19 యాత్రలు అందుబాటులో ఉన్నాయి.

