పవన్ కళ్యాణ్ శాఖ దేశంలోనే నంబర్‌ వన్.. జాతీయ స్థాయిలో అవార్డులు..

Date:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ.. ఓ విభాగంలో రెండో స్థానంలో.. మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ -జన్ భాగీదారీ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా గతంలో 24వ ప్లేసులో ఏపీ పంచాయతీరాజ్ శాఖ .. నేడు దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

జాతీయ స్థాయిలో అవార్డులు పంట పండింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో రెండు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఒక విభాగంలో ద్వితీయ స్థానంలో నిలవగా., మరో రెండు విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి అవార్డులు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, వివిధ సేవల్లో మెరుగైన పనితీరు ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌, జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వం హయాంలో 24వ స్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ.. ఈసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా చేయటం, అలాగే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే జల్ సంచయ్ – జన్ భాగీదారీ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వచేసే పద్ధతులను ప్రోత్సహిస్తారు. ఈ రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిలిచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...